నజరయ్య మతం
![చిత్రం](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgKCJ11WFO8Zr7zwjZapkI-YnghRb_GMGal14BWuPaT3E1iIHlHr6Ibrxj5-gvIAjWMlU03WofXY0Lz_7tmadtT5t2ZgyTlugPPQ_vjoctWuO11-EVy0QHDlTpCZfaZOwzU7mVmoayBaIZEEy4x5pIc40EPHvEISVoq65sojXOAOsDv4yrvxNErUTBpSlek/s320/Screenshot_20240615-202726.png)
నూతన మతతత్వ సిద్ధాంతాలతో కూడిన 'నజరయ్య మతం' రెండు వందల ఏళ్ల క్రితం నాటిది. ఆనాటి కాలంలో అణగారిన వర్గాలను ఆకర్షించిన మతాల్లో నజరయ్య మతం ఒకటి. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని త్రిపురాంతకం, నరసరావుపేట, బాపట్ల వంటి కొన్ని ప్రాంతాలకే ఈ మతం పరిమితం కావడంతో కొద్ది కాలంలోనే నజరయ్య మత సిద్ధాంత భావనలు పూర్తిగా కనుమరుగైపోయాయి. ఆనాటి సమాజంలోని అణగారిన వర్గాల ప్రజలు ప్రత్యామ్నాయ మతాల వైపు చూస్తున్న కాలంలో నజరయ్య మతం వారికి కొంత ఊరటనిచ్చింది. 1890కి ముందు ఒంగోలు కేంద్రంగా నడిచిన మిషనరీలో ఎమ్మా రోషాంబు క్లౌ ఉన్నారు. ఆమె గొప్ప పరిశోధకురాలు. రాయల్ ఏషియాటిక్ సొసైటీ సభ్యురాలు. ఆ రోజుల్లోనే స్త్రీల హక్కులు, సమస్యల గురించి పుస్తకాలు రాశారు. ఆమె రాసిన ' While Sewing Sandals or Tales of a Telugu Pariah Tribe ' అనే పుస్తకం 1899లో ప్రచురితమైంది. ఈ పుస్తకాన్ని "చెప్పులు కుడుతూ కుడుతూ" అనే పేరుతో వివిన మూర్తి 2009లో తెలుగులో అనువదించారు. ఎమ్మా రోషాంబు క్లౌ ఆనాటి అనగారిన వర్గాల ప్రజలతో కలిసి జీవిస్తూ వారి జీవన, సాంస్కృతిక పరిస్థితులను దగ్గరగా పరిశీలిస్తూ ఈ పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకంలో
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి