పోస్ట్‌లు

సెప్టెంబర్, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

గబ్బిలమా ! మళ్ళీ మా గోడు వినుమా..!

చిత్రం
గబ్బిలం  ముద్రితమై ఎనభై ఏళ్ళు గడిచిపోయాయి. ఆనాటి తెలుగు సాహిత్య లోకంలో గబ్బిలం కావ్యం ఓ విప్లాత్మకమైన రచన. అప్పటి వరకూ నడుస్తున్న సాంప్రదాయానికి భిన్నంగా ' మందభాగ్యుడైన ఓ హరిజనుడు ' గబ్బిలం కావ్యంలో కథానాయకుడు కావడం విశేషం. అంటరానితనం, అసమానతలు, ఆకలి భాధలే కావ్య కథా వస్తువు. అందుకే అప్పట్లో గబ్బిలం కావ్యం చర్చనీయాంశం. సాహసోపేతమైన, నూతన ప్రక్రియా కావ్యాలు రచించి వెలువరించడానికి నాటి కాలంలో ధైర్యం కావాలి. మహాకవి గుర్రం జాషువాలో ఆ ధైర్యం మెండుగా ఉంది. అందుకే, నాటి సంప్రదాయ వాదాన్ని ధిక్కరించి గబ్బిలం రచించాడు. అందుకే,  వినుకొండ లాంటి మారుమూల ప్రాంతాన్ని, దేశాన్ని, ఖండాంతరాలనూ దాటి ప్రపంచ ప్రసిద్ధ కావ్యాల జాబితాలో గబ్బిలం తనదైన స్థానాన్ని సంపాదించుకుంది. గబ్బిలం కావ్యం గుర్రం జాషువా అనుభవంలో నుంచి పుట్టిన కావ్యం. నాటి పరిస్థితులను గుర్తుచేస్తూ జాషువా ఇలా చెబుతాడు.." తూచి చెప్పరాని నెత్తుటి సిరాతో నా కులం వారు శోకరసంతో నిండిన అనేక కావ్యాలు రాస్తున్నారు. అగ్రజాతి వారి వజ్రం వంటి కఠినమైన మనస్సులు ఆ కావ్యాలకు కరిగి సంతోషిస్తాయో లేక మా వాళ్ల కావ్యాలు వారిని ఆనందింపజేయలేక అడ్డగింతలత...

వారం రోజుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్

చిత్రం
రాష్ట్రంలోని 18 యూనివర్సిటీల్లో  ఖాళీగా ఉన్న 3295 అధ్యాపకుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రా రెడ్డి చెప్పారు. 3295 ఉద్యోగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు ఉన్నాయని అన్నారు. తాజాగా ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ NTv కి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 2009లో చివరిసారిగా  యూనివర్సిటీల్లో అధ్యాపకుల భర్తీ జరిగిందని, అప్పటి నుంచి వివిధ కారణాలతో యూనివర్సిటీ అధ్యాపకుల భర్తీ జరగలేదని చెప్పారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఉన్నతమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతిశ్చయంతో ఉందని, అందుకే న్యాయపరమైన చిక్కులన్నిటిని దాటుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరలో అధ్యాపకుల నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. భర్తీ ప్రక్రియ మొత్తం డిసెంబర్ నాటికి పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నామని, ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు  వెలువడే అవకాశం ఉందని, వారం రోజుల్లో అధ్యాపకుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రయత్నిస్తున...