స్క్రీనింగ్ పరీక్ష తరువాత..

రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బంది నియామకానికి డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. ఏపీపీఎస్సీ తన అధికారిక వెబ్సైట్లో తాత్కాలిక పరీక్షల తేదీలను పొందుపరుస్తూ వెబ్ నోట్ విడుదల చేసింది. డిసెంబర్ 18 నుంచి సుమారు 20 రోజులపాటు వివిధ సబ్జెక్టులలో స్క్రీనింగ్ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం స్క్రీనింగ్ పరీక్షలు జరుగుతాయా లేదా అన్న చర్చను పక్కన పెడితే, స్క్రీనింగ్ పరీక్షలు ముగిసిన తరువాత ప్రక్రియ ఎలా ఉంటుందనేది తెలుసుకోవాల్సిన విషయం. 2018లో.. 2018లో జరిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్ స్క్రీనింగ్ పరీక్షలను ఒకసారి పరిశీలిస్తే.. 2018 జనువరి చివరి వారంలో దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత ఏప్రిల్ మొదటి వారంలో కంప్యూటర్ బేస్డ్ స్క్రీనింగ్ పరీక్షలను ఏపీపీఎస్సీ నిర్వహించింది. తదనంతరం రెస్పాన్స్ షీట్స్ తో పాటు ప్రాథమిక కీ విడుదల చేసారు. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన తరువాత తుది కీ విడుదల చేసి, ఫలితాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు. ఈ ఫలితాల జాబితాలో సబ్జెక్టుల వారిగా ఎంతమంది అభ్యర్థులు పరీక్ష రాశ
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి