జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

" ఎరుకలీ నాగన్న ఉంటుండే.." మనసుకి హత్తుకునే గోరటి పాట

ఈ పాట మొత్తానికి చివరి పదాలే ప్రాణం పోస్తాయి.పాటంతా విన్నాక చివాలున బాకుతో కుమ్మినట్టు గుండె మెలిపెడుతుంది.పాట మొత్తం ప్రేమను పంచే ఎరుకలి నాగన్నకు చివరిగా మనిషంటే ఎందుకంత భయమో మనకూ అర్థం కాదు. గోరటి వెంకన్న రాసిన "ఎరుకలీ నాగన్న ఉంటుండే.." పాట ఒక్క సారైనా వినాల్సిన పాట.గోరటి వెంకన్న మన గిరిజన సంస్కృతిని మొత్తం ఈ ఒక్క పాటలో ఆవిష్కరించాడు.గిరిజన సంస్కృతి ఎంత గొప్పదో,ఎంత ప్రేమ కలిగిందో,ఎంత అమాయకమైందో,ఎంత ధైర్యం ఉంటుందో ఈ ఒక్క పాట వింటే చాలు,మనకు పూర్తిగా అర్థమైపోతుంది.కేశవరెడ్డి నవల్లో  'సుక్కపంది' అంత గొప్పగా, ముసలివాడంత ప్రేమగా ఈ పాట ఉంటుంది.

"బూడిద పిర్రల బుడ్డ గోసి

బిర్రుగా నడుముకి ఎగవోసి

సెడుగుడు సెడుగుడు అడుగు

ఎలుగులెంకటి పిట్ట పరుగు

ఎడమ చేతిల ఎదురు బరుగు

అడవి దుప్పాలెల్ల తిరుగు.."

ఈ ఒక్క చరణం వింటే చాలు ఎరుకలి నాగన్న మన కళ్ళముందు ఠక్కున ప్రత్యక్షం అవుతాడు.ఇలాంటి నాగన్నే ఒకడుండే వాడు కదూ అంటూ కేశవ రెడ్డి అడవిని జయించాడు గుర్తొస్తుంది.ఊరికి దూరంగా, అడవికి దగ్గరగా ఉండే గిరిజన గూడెల్లో ఇలాంటి అమాయక జనాలు ఉంటారు. ఈ పాటలోని ఎరుకలి నాగన్న గుడిసెకి కనీసం తలుపు కూడా ఉండదు.అతను ఎంతో ప్రేమ కలిగినవాడు. అడివికి వేటకు పోతే ఐదు కముజులు మాత్రమే పట్టుకొస్తాడు. అంతకన్నా ఎక్కువ పడితే వాటిని అడవిలోనే వదిలేస్తాడు. వాటిల్లో ఊరు సాయిబుకు ఒకటి, గౌడకి మరొకటి, ఆకలితో ఉన్న వాడికి అడక్కుండానే ఒకటి ఇచ్చే దయామూర్తి ఎరుకలి నాగన్న.అతడి ఆస్తి మొత్తం పంది పిల్లలే, పంది పిల్లలంటే అతనికి ప్రాణం. పంది పిల్లలే అతని బంధువులు....

" సుక్కపంది పిల్ల పుడితే,

సుఖము జరిగెని మొక్కేటోడు.

బట్టపందికి కల్లు దాపి,

భాగవతమిని పించేటోడు. 

రాగిగున్నకు తోడు జూపి,

యోగమును  తిలకించెటోడు.

పందులే తన బంధువులుగా 

బాధల్లో సుఖములో..."

అంత ప్రేమ కలిగిన ఎరుకలి నాగన్న, ఆరడుగుల నాగుపామును కూడా అవలీలగా పట్టే నాగన్న, బతికుండగానే విషాన్ని పిండి దాన్ని జాగర్తగా అడవిలో వదిలే నాగన్నకు ఎవర్ని చూస్తే భయమో తెలుసా..

"బుసలు కొట్టే విషనాగులకే,

గుబులునీ పుట్టించేటోడు.

ఊరి దొరల చూసి ఎందుకో,

నాగన్న ఎనుకట,

ఉరుకులు పరుగులు పెట్టేది.."

పాటంతా సంతోషంగా వింటూ ఆ చివరి పదాలు విన్నాక,మన బుర్ర చుట్టూ వందల ప్రశ్నలు గిర్రున తిరుగుతూ మనకూ గుబులు పుట్టిస్తాయి.పాటంతా విన్నాక ఇప్పటి జై భీమ్ సినిమా గుర్తొస్తాది.పాటంతా విన్నాక  ఎరుకలి నాగన్న కూడా మన చుట్టూతా తిరుగుతున్నట్టే ఉంటుంది.

- శిఖా సునీల్

(ఈ పాటను వినడానికి క్రింద లింక్ క్లిక్ చేయండి..

https://youtu.be/7vyjsgtf1m8)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మన విను' కొండ పండుగ '

జె.ఎల్. నోటిఫికేషన్ ( లిమిటెడ్ రిక్రూట్మెంట్ ) విడుదల

నెట్ తెలుగులో నేనెలా అర్హత సాధించానంటే..

డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు

తెలుగు లెక్చరర్ 16 ఖాళీలకు ఆర్జీయూకేటి నోటిఫికేషన్

అసిస్టెంట్ ప్రొఫెసర్, దరఖాస్తు చేయడం ఎలా

పార్ట్ టైమ్ పీహెచ్.డి

తెలుగు లెక్చరర్ (డీ.ఎల్) సాధించాలంటే..

తెలుగు ప్రశ్నా పత్రం, 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్

అసిస్టెంట్ ప్రొఫెసర్ (2017) స్క్రీనింగ్ టెస్ట్