జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

ఏపీసెట్ తెలుగు కటాఫ్ - విశ్లేషణ


రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష ఏపీసెట్-2021 ఫలితాలు విడుదలయ్యాయి. వీటితో పాటు ఏపీసెట్-2021 అధికారిక వెబ్ సైట్ లో వివిధ సబ్జెక్టుల కటాఫ్ మార్కులు పొందుపరిచారు.డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, యూనివర్సిటీల్లో టీచింగ్ ఫ్యాకల్టీగా నియామకం పొందాలంటే ఏపీసెట్ లేదా యూజీసి-నెట్ అర్హత సాధించాలన్న విషయం తెలిసిందే.

తెలుగు సాహిత్యంలో కటాఫ్..

తెలుగు సబ్జెక్టు కటాఫ్ మార్కులను పరిశీలిస్తే..ప్రతి ఏడాది పరీక్ష కూడా కఠినంగా మారుతున్న విషయం అర్థమవుతుంది. పరీక్ష రాసే అభ్యర్థుల సంఖ్య పెరుగడంతో పోటీ తీవ్రత కూడా పెరుగుతూనే ఉంది.సబ్జెక్టు లో పూర్తి పట్టు సాధించిన వాళ్ళే పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తున్నారు. ఏపీసెట్-2021 కటాఫ్ మార్కులను పరిశీలిస్తే.... అన్ రిజర్విడ్ కేటగిరీలో 48.00 పర్సెంట్ సాధించిన అభ్యర్థులు అర్హత సాధించారు. పోయిన ఏడాది ఏపీసెట్ పరీక్షలో అన్ రిజర్వడ్ కేటగిరీలో46 శాతం అర్హత ఉంది. అంటే, గత ఏడాదితో పోలిస్తే ఈ సారి రెండు శాతం అర్హత మార్కులు పెరిగాయి.అలాగే ఇప్పటి ఏపీసెట్ లో బిసి- ఏ (43.33), బిసి- బి (44.67), బిసి- సి(44.67), బిసి-డి (44.00), బిసి- ఈ (44.00) అర్హత సాధించారు.ఇక ఎస్సి లో 41.33, ఎస్టీ లో 38.67, ఈడబ్ల్యూఎస్ లో 45.33 శాతం స్కోర్ చేసిన అభ్యర్థులు అర్హత సాధించారు.మహిళా కేటగిరిలో ఒక శాతం అటూ ఇటూ ఇవే మార్కులతో అర్హత సాధించారు. కొద్ది మార్కులతో అర్హత కోల్పోయిన విద్యార్థులు ఏ మాత్రం నిరుత్సాహ పడకుండా ఐదే ప్రిపరేషన్ కొనసాగిస్తే డిసెంబర్ లో జరిగే యూజీసి- నెట్ పరీక్షలో, వచ్చే ఏడాది ఏపీసెట్ లో అర్హత సాధించవచ్చు.



కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మన విను' కొండ పండుగ '

జె.ఎల్. నోటిఫికేషన్ ( లిమిటెడ్ రిక్రూట్మెంట్ ) విడుదల

నెట్ తెలుగులో నేనెలా అర్హత సాధించానంటే..

డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు

తెలుగు లెక్చరర్ 16 ఖాళీలకు ఆర్జీయూకేటి నోటిఫికేషన్

అసిస్టెంట్ ప్రొఫెసర్, దరఖాస్తు చేయడం ఎలా

పార్ట్ టైమ్ పీహెచ్.డి

తెలుగు లెక్చరర్ (డీ.ఎల్) సాధించాలంటే..

తెలుగు ప్రశ్నా పత్రం, 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్

అసిస్టెంట్ ప్రొఫెసర్ (2017) స్క్రీనింగ్ టెస్ట్