జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

హరిశ్చంద్రుడి కోసమే ఆయన పుట్టాడు..

 


తెలుగునాట హరిశ్చంద్రుడి పాత్రకు ప్రాణం పోసిన మహానటుడు బండారు రామారావు. హరిశ్చంద్రుడి కోసమే ఆయన పుట్టాడా.. ఆయన కోసమే ఆంధ్రదేశంలో హరిశ్చంద్రుడు పుట్టాడా అన్నట్లు తెలుగుదేశంలో అభినవ హరిశ్చంద్రుడిగా తిరుగులేని పేరు గడించిన "నటచూడామణి " బండారు రామారావు. హరిశ్చంద్రుడి వేషధారణలో రంగస్థలంపై అడుగుపెడితే చాలు ప్రేక్షకులు మైమరచి పోయేవారు. స్మశాన ఘట్టంలో ఆయన రంగప్రవేశం ఓ అద్భుత సన్నివేశం. పదే పదే చూడాలనిపించే ఆయన హావభావాలను అభివర్ణించి ఆనాటి రసజ్ఞులు మురిసిపోయేవారు. ఆయన పాడే కరుణ రసాత్మకమైన పద్య రాగాలకు ప్రేక్షకులు కన్నీళ్ళతో తడిసి ముద్దయ్యేవారు. తెల్లారిందాకా నాటకాన్ని విక్షించి సూర్యోదయపు బంగారు వెలుతుర్లో ఆయన నట విశ్వరూపాన్ని చూసి మైమరచి పోయేవారు.

రెండున్నర దశాబ్దాలపాటు తెలుగు పద్య ప్రేమికులను రంజింపజేసిన బండారు రామారావు స్వస్థలం ప్రకాశం జిల్లా అద్దంకి గ్రామం.1932లో బండారు సుబ్బమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించాడు. బండారు రామారావు తండ్రి బండారు సుబ్బయ్య యక్షగానంలో ఆరితేరిన కళాకారుడు. ఆ కారణంగానే బండారు రామారావు చిన్నతనం నుంచే కళారంగం పట్ల ఆకర్షితుడయ్యాడు. చిన్ననాటే హరిశ్చంద్రుడి యక్షగానంలో లోహితాస్యునిగా నటించి మెప్పించాడు. సంస్కృతం ప్రధాన సబ్జెక్టుగా ఎస్.ఎస్.ఎల్.సి వరకు చదివి, కొద్దిరోజుల పాటు ఉపాధ్యాయుడిగా పనిచేసి ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అంతకు ముందే పదహారేళ్ళ వయసులోనే నాటకరంగంలో అడుగు పెట్టి అనతికాలంలోనే మంచి రంగస్థల కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. బలిజేపల్లి విరచిత సత్యహరిశ్చంద్ర నాటకం గొప్ప పేరు గడించడానికి అప్పటి మహానటులు బందరు సుబ్బారావు, బందా కనకలింగేశ్వరరావు, కె.నాగేశ్వరరావు, నల్లంచి అప్పారావు, మల్లాది సూర్యనారాయణ వంటి గొప్ప కళాకారులే ప్రధాన కారణం. హరిశ్చంద్రునిగా వేషం ధరించి మెప్పించారు. ఆ తరువాత రంగప్రవేశం చేసిన బండారు రామారావు హరిశ్చంద్ర నాటకాన్ని మరో దశకు తీసుకెళ్ళాడు. హరిశ్చంద్రుడ్ని పల్లె బాట పట్టించిన ఘనత బండారు రామారావుకే దక్కుతుంది. అప్పట్లో మహాకవి గుర్రం జాషువా ఖండకావ్యం పేరుతో "స్మశానవాటిక" పద్యాలు రచించాడు. ఈ పద్యాలు కాటిసీనులో చేర్చిన బండారు రామారావు హరిశ్చంద్రున్ని కొత్త పుంతలు తొక్కించాడు. కాటిసీనులో స్మశాన వర్ణనలో కొన్ని పద్యాలు మాత్రమే ఉండేవి. కానీ బండారు రామారావు గాత్రంలో గుర్రం జాషువా పద్యాలు ఆలపించటం మొదలైన తర్వాత సత్య హరిచంద్ర నాటకం ఆంధ్రదేశంలో దేదీప్యమానంగా వెలిగిపోయింది. 

బండారు రామారావు అభినయం, గాత్రం, వాక్చాతుర్యం, అత్యద్భుతంగా ఉండేది. ఒక రాగాన్ని అందుకుని ఆ రాగంలోనుంచి మరో రాగంలోకి అవలీలగా తీసుకెళ్ళడం ఆయన ప్రత్యేకత. దానికి తోడు హావభావాలు అత్యద్భుతం. బండారు గాత్రం ఎంతో మధురంగా, శ్రావ్యంగా ఉంటుంది. అందుకే తెలుగుదేశ ప్రజలకు బండారు పద్యం అంటే చెప్పలేనంత ఇష్టం. కాటిసీను, వారణాసి ఆయనకు ఎనలేని కీర్తి తెచ్చిపెట్టింది.1964లో వినుకొండలో మహాకవి గుర్రం జాషువా చేతుల మీదుగా గండపెండేర సత్కారాన్ని పొంది, "నటచూడామణి" బిరుదాంకితుడయ్యాడు. ఆంధ్రదేశంలో ఎన్నో సత్కారాలు సన్మానాలు పొందాడు.1974లో చివరిసారిగా గుంటూరు జిల్లా వినుకొండలో ఆయన హరిశ్చంద్ర పాత్రపోషణ చేశాడు. ఆ తరువాత చిన్న వయసులోనే 1976లో చనిపోయాడు. చనిపోయేంతవరకూ కళామతల్లి సేవలోనే తరించాడు." సుకవి జీవించు ప్రజల నాల్కల యందు.." అన్నట్లు సుకవే కాదు కళాకారుడూ చిరంజీవే. అందుకే, బండారు రామారావు మరణించి 45 సంవత్సరాలు దాటినా ఆయన ఆలపించిన రాగమాలిక ఇప్పటికీ ప్రజల నాలుకల మీద ఆడుతూనే ఉంటుంది.

- శిఖా సునీల్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మన విను' కొండ పండుగ '

జె.ఎల్. నోటిఫికేషన్ ( లిమిటెడ్ రిక్రూట్మెంట్ ) విడుదల

నెట్ తెలుగులో నేనెలా అర్హత సాధించానంటే..

డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు

తెలుగు లెక్చరర్ 16 ఖాళీలకు ఆర్జీయూకేటి నోటిఫికేషన్

అసిస్టెంట్ ప్రొఫెసర్, దరఖాస్తు చేయడం ఎలా

పార్ట్ టైమ్ పీహెచ్.డి

తెలుగు లెక్చరర్ (డీ.ఎల్) సాధించాలంటే..

తెలుగు ప్రశ్నా పత్రం, 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్

అసిస్టెంట్ ప్రొఫెసర్ (2017) స్క్రీనింగ్ టెస్ట్