జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

నెట్ తెలుగులో పోటీ తీవ్రం

తెలుగు సాహిత్యంలో యూజీసీ నెట్ అర్హత సాధించాలన్నా, జేఆర్ఎఫ్ అవార్డు పొందాలన్నా, డీఎల్ వంటి పోటీ పరీక్షల్లో నెగ్గాలన్నా పోటీ చాలా తీవ్రంగానే ఉంటుంది. తెలుగు రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఎంఏ తెలుగు సాహిత్యం చదివే విద్యార్థులతో పాటు, దూరవిద్య ద్వారా తెలుగు చదివే విద్యార్థుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూ వస్తోంది. ఎంఏ తెలుగు సాహిత్యం పూర్తి చేసిన ప్రతి అభ్యర్థి యూజీసీ నెట్ లో అర్హత సాధించాలనే పట్టుదలతో ఉంటారు. దీంతో తెలుగు సాహిత్యంలో నెట్, సెట్, ఇతర పరీక్షలకు ప్రతి ఏడాది పోటీ తీవ్రత పెరుగుతోంది.


2021 యూజీసీ నెట్ ఫలితాలను పరిశీలిస్తే.. దేశవ్యాప్తంగా 81 సబ్జెక్టుల్లో 6,71,288 మంది అభ్యర్థులు నెట్ పరీక్షకు హాజరయ్యారు. అత్యధికంగా నెట్ పరీక్షకు హాజరైన సబ్జెక్టుల్లో తెలుగు సాహిత్యం 30వ స్థానంలో ఉండటం గమనార్హం.2020 డిసెంబర్, 2021 జూన్ రెండు సషన్లకు కలిపి గత ఏడాది డిసెంబర్లో  నెట్ పరీక్షలు జరిగాయి. తెలుగు సాహిత్యంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటూ ఇతర రాష్ట్రాలలో తెలుగు సాహిత్యం చదివిన 4902 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాయారైనట్లుగా యూజీసీ తన అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు. వీరిలో కేవలం 154 మంది అభ్యర్థులు మాత్రమే నెట్ అర్హత సాధించారు. ఇక జేఆర్ఎఫ్ అవార్డు పొందిన వారు కేవలం 44 మంది అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. దీనిని బట్టి తెలుగు సాహిత్యంలో పోటీ ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు సాహిత్యంలో సుమారు రెండువేల మంది పైగా అభ్యర్థులు నెట్, సెట్ అర్హత సాధించి ఉంటారనేది ఒక ప్రాధమిక అంచనా. దీనిని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో తెలుగు సాహిత్యంలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడానికి అవసరమైన ప్రణాళిక రచించుకొని ముందుకు వెళ్ళడం మంచిది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మన విను' కొండ పండుగ '

జె.ఎల్. నోటిఫికేషన్ ( లిమిటెడ్ రిక్రూట్మెంట్ ) విడుదల

నెట్ తెలుగులో నేనెలా అర్హత సాధించానంటే..

డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు

తెలుగు లెక్చరర్ 16 ఖాళీలకు ఆర్జీయూకేటి నోటిఫికేషన్

అసిస్టెంట్ ప్రొఫెసర్, దరఖాస్తు చేయడం ఎలా

పార్ట్ టైమ్ పీహెచ్.డి

తెలుగు లెక్చరర్ (డీ.ఎల్) సాధించాలంటే..

తెలుగు ప్రశ్నా పత్రం, 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్

అసిస్టెంట్ ప్రొఫెసర్ (2017) స్క్రీనింగ్ టెస్ట్