జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

పద ( యధార్థ సంఘటన )

కొన్ని జరిగిన సంఘటనలు వినటమే కానీ చూసే అవకాశం ఉండదు. 1990 - 2000 సంవత్సరాల మధ్య విప్లవ పోరాటాల నేపథ్యం ఉన్న సంఘటనలు చాలా ఆసక్తిగా ఉంటాయి. విప్లవకారుల చర్యలు దినపత్రికల్లో చదివినప్పుడు, టీవీల్లో చూసినప్పుడు ఉత్కంఠగా, ఆసక్తి రేకెత్తిస్తూ ఉంటాయి. అలాంటి యధార్థ సంఘటనల నేపథ్యాన్ని కథగా తీసుకుని తెరకెక్కిన సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకుల మనసులు కొల్లగొడుతూనే ఉంటాయి. విప్లవ పోరాట నేపథ్యాన్ని చూపించే సినిమాల్లా కాకుండా, కేవలం ఒక్కరోజులో, ఇరవై గంటల వ్యవధిలో జరిగిన సంఘటన యధావిధిగా తెర మీద చూపిస్తే చాలా బాగుంటుంది. 1996లో కేరళలో ఇలాంటి ఓ సంఘటన జరిగింది. ఈ సంఘటన అప్పటి రాష్ట్ర ప్రభుత్వాన్నే కాకుండా, కేంద్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది. దీనికి సంబంధించిన పోరాట నేపథ్యం ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నప్పటికీ ఆ పోరాటం మొత్తాన్నీ ప్రతిబింబించే సంఘటన ఒక్క రోజులో జరిగింది. దీన్నే కథాంశంగా తీసుకుని మలయాళ దర్శకుడు కమల్ కె.ఎం.' పద ' సినిమాను తెరకెక్కించాడు. గత మార్చి10న విడుదలైన ఈ సినిమా కేవలం రోజుల వ్యవధిలోనే తప్పక చూడాల్సిన సినిమాల జాబితాలో చేరిపోయింది.

కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో 1996లో జరిగిన యధార్థ సంఘటన ' పద ' సినిమా. కేరళ రాష్ట్రంలో ఆదివాసీల సంఖ్య కేవలం ఒక్క శాతంలోపే ఉంటుంది. వీరంతా అడవిని, భూమిని నమ్ముకుని జీవించే వారే. అలాంటి అమాయక గిరిజనుల జీవనోపాధిని దెబ్బ కొట్టే ఆదివాసీ భూ చట్టాన్ని 1976లో అప్పటి  కేరళ ప్రభుత్వం చేసింది. నాటి నుంచీ ఆదివాసీలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రకరకాల ఉద్యమాలు, నిరసనలు చేశారు. వీటిని ఏమీ పరిగణలోకి తీసుకోకుండా, నిరసన కారుల డిమాండ్లను పట్టించుకోకుండా కేరళ ప్రభుత్వం 1996లో ఆదివాసీ భూ చట్టానికి సవరణ చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదింప చేస్తుంది. ఈ చట్టం ద్వారా ఆదివాసుల జీవనోపాధి అగమ్యగోచరంగా మారుతుంది. భూమిని, అడవిని వదిలేసి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని ఎలాగైనా ఆపాలనే ఉద్దేశంతో కొంత మంది అభ్యుదయవాదులు, నిరసనకారులు నిర్ణయించుకుంటారు. వీరిలో బాలు, అరవింద్, రాజేష్, కుట్టి అనే నలుగురు గిరిజన ఉద్యమకారులు ఒక టీమ్ గా ఏర్పడి తమ నిరసనను తక్షణం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఓ పథకం సిద్ధం చేస్తారు. వీరి పథకంలో భాగంగా పాలక్కాడ్ జిల్లా కలెక్టర్ ను తమ అదుపులోకి తీసుకుని నిర్భందిస్తే వెంటనే మీడియా దృష్టి ఆకర్షించి తమ సమస్య ప్రభుత్వానికి చేరుతుందని తద్వారా పరిష్కారం లభిస్తుందని భావిస్తారు. వీరి ప్లాన్ లో భాగంగా ఓ తుపాకీని కొనుగోలు చేస్తారు. కొన్ని బాంబులు సిద్ధం చేసుకుంటారు. వీటన్నిటితో కలెక్టరేట్లోకి ప్రవేశిస్తారు. ఇక్కడ నుంచే సినిమా ప్రారంభమవుతుంది..

కేవలం ఒక్క రోజులో జరిగిన కథాంశాన్ని డైరెక్టర్ కమల్ కె.ఎం. అద్భుతంగా రెండు గంటల పది నిమిషాల సినిమాగా తెరకెక్కించాడు. సినిమా ప్రారంభమైన తరువాత సుమారు గంటసేపు ఉత్కంఠగా సాగుతుంది. మొదటిసారి సంచలనాన్ని చేయాలనుకునే వ్యక్తుల ఫీలింగ్స్ ఈ సినిమాలో అత్యద్భుతంగా చూపించారు. బాలు (వినాయకన్), అరవిందన్ (జోజు జార్జి), రాజేష్ (కుంచాకో బోజన్), కుట్టి (దిలీప్ పోతన్) నటన సహజత్వం ఉట్టి పడుతుంది. నిమిష నిమిషానికీ ఆ తర్వాత ఏం జరుగుతుందా అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగించారు. ఈ సినిమాలో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా ప్రకాష్ రాజ్ నటించారు. సమీర్ తాహిర్ ఫోటోగ్రఫీ, షాన్ మహ్మద్ ఎడిటింగ్, విష్ణు విజయ్ సంగీతం అద్భుతం. నిజ జీవిత సంఘటనలు చూడాల్సిన అవసరం ఉంది. విప్లవోద్యమ నేపథ్యం ఉన్న నిజ జీవిత సంఘటనలు అస్సలు మిస్ కాకూడదు.

- శిఖా సునీల్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మన విను' కొండ పండుగ '

జె.ఎల్. నోటిఫికేషన్ ( లిమిటెడ్ రిక్రూట్మెంట్ ) విడుదల

నెట్ తెలుగులో నేనెలా అర్హత సాధించానంటే..

డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు

తెలుగు లెక్చరర్ 16 ఖాళీలకు ఆర్జీయూకేటి నోటిఫికేషన్

అసిస్టెంట్ ప్రొఫెసర్, దరఖాస్తు చేయడం ఎలా

పార్ట్ టైమ్ పీహెచ్.డి

తెలుగు లెక్చరర్ (డీ.ఎల్) సాధించాలంటే..

తెలుగు ప్రశ్నా పత్రం, 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్

అసిస్టెంట్ ప్రొఫెసర్ (2017) స్క్రీనింగ్ టెస్ట్