జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

స్క్రీనింగ్ పరీక్ష ఎప్పుడు ఉండవచ్చు..?

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను బలోపేతం చేసి నాణ్యమైన విద్యను అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. అందుకే, విశ్వవిద్యాలయాల్లో ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉన్న టీచింగ్ ఫ్యాకల్టీ  భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అడ్డంకులన్నీ దాటుకుని విజయవంతంగా భర్తీ ప్రక్రియ పూర్తి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విద్యాశాఖలో ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కాని సమస్యలకు ప్రస్తుత ప్రభుత్వం పరిష్కార మార్గాలు చూపించిన విషయం తెలిసిందే. 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వడం, ఉన్నత పాఠశాలల్లో అప్ గ్రేడ్ వంటి సమస్యలను పరిష్కరించింది. ఇదే కోవలోనే విశ్వవిద్యాలయాలలో ఎన్నో ఏళ్ళుగా ఖాళీగా ఉన్న టీచింగ్ ఫ్యాకల్టీ భర్తీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది.


ఈ నెల 27తో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. ఇక, స్క్రీనింగ్ పరీక్ష ఎప్పుడు ఉండవచ్చు అనేదే అభ్యర్థుల ముందు ఉన్న పెద్ద ప్రశ్న ? గత నోటిఫికేషన్ (2018) పరిశీలిస్తే స్క్రీనింగ్ పరీక్ష గురించి ఓ అవగాహనకు రావచ్చు. 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల నోటిఫికేషన్లు, 2017 డిసెంబర్ చివరి వారం నుంచి 2018 జనవరి మొదటి వారం వరకు వివిధ విశ్వవిద్యాలయాలు విడివిడిగా జారీ చేశాయి. దరఖాస్తును ఆయా యూనివర్సిటీలకు పంపించడానికి నెల రోజుల వ్యవధి ఇచ్చారు. ఉదాహరణకు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం డిసెంబరు 27, 2017న నోటిఫికేషన్ జారీచేయగా, అప్లికేషన్ పంపేందుకు జనువరి 27, 2018 వరకు గడువు ఇచ్చింది. అంటే నెలరోజులు వ్యవధి. తదనంతరం ఏప్రిల్ మొదటి వారం నుంచి స్క్రీనింగ్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత  60 రోజుల వ్యవధిలో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు.

గత నోటిఫికేషన్ తో ప్రస్తుత నోటిఫికేషన్ ను పోల్చితే దరఖాస్తు వ్యవధి నెలరోజుల కన్నా  తక్కువే. అదేవిధంగా స్క్రీనింగ్ పరీక్ష కూడా ముందుగానే ఉండే అవకాశం ఉంది. అంటే ఈనెల 27న దరఖాస్తు ప్రక్రియ ముగిస్తే డిసెంబర్ చివరివారం లేదా జనవరి మొదటి వారంలో స్క్రీనింగ్ పరీక్ష ఉండే అవకాశం ఉందని అంచనా వేయవచ్చు. ఆ తరువాత ఫలితాల ప్రకటన, ఇంటర్వ్యూలకు చాలా సమయం అవసరం అవుతుంది. జనువరిలో సంక్రాంతి, తదనంతరం ఎన్నికల వాతావరణం వుంటుంది. రానున్న ఎన్నికలకు ముందే విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాలనేది ప్రభుత్వ సంకల్పం. కాబట్టి, జనవరి మొదటి వారం, అంతకు ముందే స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించే అవకాశాన్ని కాదనలేం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మన విను' కొండ పండుగ '

జె.ఎల్. నోటిఫికేషన్ ( లిమిటెడ్ రిక్రూట్మెంట్ ) విడుదల

నెట్ తెలుగులో నేనెలా అర్హత సాధించానంటే..

డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు

తెలుగు లెక్చరర్ 16 ఖాళీలకు ఆర్జీయూకేటి నోటిఫికేషన్

అసిస్టెంట్ ప్రొఫెసర్, దరఖాస్తు చేయడం ఎలా

పార్ట్ టైమ్ పీహెచ్.డి

తెలుగు లెక్చరర్ (డీ.ఎల్) సాధించాలంటే..

తెలుగు ప్రశ్నా పత్రం, 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్

అసిస్టెంట్ ప్రొఫెసర్ (2017) స్క్రీనింగ్ టెస్ట్