జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు జరిగేనా.. ?

అసిస్టెంట్ ప్రొఫెసర్ స్క్రీనింగ్ పరీక్షల కోసం అభ్యర్థులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాత్కాలిక పరీక్ష తేదీలను ప్రకటిస్తూ వెబ్ నోట్ విడుదల చేసింది. ఈ నెల 18 నుంచి జనువరి 5 వరకు వివిధ సబ్జెక్టుల్లో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. అయితే, ఈ షెడ్యుల్ ప్రకారం పరీక్షలు జరిగేనా అనే సందేహాలు అభ్యర్థుల్లో వ్యక్తమవుతున్నాయి.


నవంబర్ 27తో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. మూడు రోజుల తర్వాత నవంబర్ 30న పరీక్షకు అర్హులైన అభ్యర్థుల ప్రాథమిక జాబితా, అభ్యంతరాల స్వీకరణ తర్వాత డిసెంబర్ 8న తుది జాబితా విడుదల చేయాల్సి ఉంది. దీని ప్రకారం డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. అయితే, నోటిఫికేషన్ లోని కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ అభ్యర్థులు కొందరు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో వివిధ విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం వ్యవహారం మొత్తం ఉన్నత న్యాయస్థానం పరిధిలో ఉండడంతో అభ్యర్థులందరూ కోర్టు ఆదేశాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నేటి వరకు ప్రక్రియలో ఎలాంటి కదలిక లేకపోవడంతో యథాతథస్థితి కొనసాగుతూ ఉంది. దీంతో, డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు జరిగేనా అని అభ్యర్థుల్లో సందేహం వ్యక్తమవుతూ ఉంది. ఒకవేళ నేడు రేపట్లో కోర్టు ఆదేశాలు విడుదలయితే దరఖాస్తులు స్కూటీని ప్రక్రియ, పరీక్షకు అర్హులైన అభ్యర్థుల తుది జాబితా ప్రకటించడానికి కనీసం పది రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. అంటే సుమారు డిసెంబరు 16 వరకూ ఈ ప్రక్రియ కొనసాగవచ్చు. ఆ తరువాత హాల్ టికెట్ల విడుదలకు పరీక్షకు మధ్య రెండు రోజుల సమయం మాత్రమే ఉండడంతో అనుకున్న షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరగడం ఎంతవరకు సాధ్యము అనే అంచనాలో అభ్యర్థులు వున్నారు. ఏపీపీఎస్సీ కూడా స్క్రీనింగ్ పరీక్షల తేదీలను తాత్కాలిక తేదీలుగానే వెబ్ నోట్ లో పేర్కొనడం, దరఖాస్తుల స్వీకరణ తరువాత ప్రక్రియ మొత్తం నిలిచిపోవడంతో 18 నుంచి జరగాల్సిన పరీక్షల నిర్వహణ ఎంతవరకు సాధ్యం అని అభ్యర్థులు ఆలోచిస్తున్నారు. భర్తీ ప్రక్రియ పూర్తి చేసి విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాలని ప్రభుత్వం ధృఢసంకల్పంతో ఉంది. ఏది ఏమైనాప్పటికీ 
ఉన్నత న్యాయస్థానం నుంచి మార్గదర్శకాలు విడుదలైతే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మన విను' కొండ పండుగ '

జె.ఎల్. నోటిఫికేషన్ ( లిమిటెడ్ రిక్రూట్మెంట్ ) విడుదల

నెట్ తెలుగులో నేనెలా అర్హత సాధించానంటే..

డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు

తెలుగు లెక్చరర్ 16 ఖాళీలకు ఆర్జీయూకేటి నోటిఫికేషన్

అసిస్టెంట్ ప్రొఫెసర్, దరఖాస్తు చేయడం ఎలా

పార్ట్ టైమ్ పీహెచ్.డి

తెలుగు లెక్చరర్ (డీ.ఎల్) సాధించాలంటే..

తెలుగు ప్రశ్నా పత్రం, 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్

అసిస్టెంట్ ప్రొఫెసర్ (2017) స్క్రీనింగ్ టెస్ట్